PRABANJANAM
Date of Publish : 07 September 2026, 10:45 am Posted by : Prabanjanam News

కారులో అగ్నిప్రమాదం.. బౌరంపేట్‌లో వ్యక్తి సజీవదహనం

  • హత్య లేక ఆత్మహత్య అనే కోణం లో పోలీసుల దర్యాప్తు.

మేడ్చల్ (ప్రభంజనం):

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కలకలం రేపింది. కారు దహనం ఘటనలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు.

మృతుడు రాధాకృష్ణ (40)గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.కాగా, ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ప్రాథమికంగా ఇది ఆత్మహత్యకు సంబంధించిన ఘటన అయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.మృతుడు బౌరంపేట్‌లోని ఓ విల్లాలో నివాసం ఉంటున్నట్లు, కుటుంబ కలహాలు,ఆర్ధిక సమస్యల కారణంగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ అంశాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.ఘటనకు గల పూర్తి కారణాలు, మంటలు ఎలా చెలరేగాయి అనే విషయాలపై దుండిగల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.