- షూటింగ్ దశ నుంచే తప్పించుకోలేకపోతున్న లీకుల బెడద
- భారీ బడ్జెట్ గ్లోబల్ మూవీపై కఠిన సెక్యూరిటీని కోరుతున్న అభిమానులు

హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాంబినేషన్లో తెరకెక్కుతున్న అంచనాల చిత్రం ‘వారణాసి’కి లీకుల సమస్య వెంటాడుతోంది. సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సుమారు 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన కొన్ని విజువల్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.భారీ బడ్జెట్తో, అత్యంత గోప్యంగా తెరకెక్కించాల్సిన ఈ చిత్రం నుంచి వరుసగా విజువల్స్ బయటకు వస్తుండటం అభిమానుల్లో టెన్షన్ను పెంచుతోంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఈ రకమైన లీకులు చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులకు కూడా నిరాశ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించి సెట్స్లో సెక్యూరిటీని మరింత కఠినతరం చేయాలని, లీకులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూపర్స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.