సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిని కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడికిటి గోపాల్ చౌదరి నేడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యల పైన సీపీ దృష్టికి తీసుకొని వెళ్లారు. శాంతి భద్రత విషయంలో సైబరాబాద్ వ్యాప్తంగా రమేష్ రెడ్డి మంచి కృషి చేస్తున్నారని అదేవిధంగా నేరాల నియంత్రణకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ముందుకు సాగాలని కోరారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా మనమే పోలీసుల వలె పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు