యాదగిరిగుట్ట (ప్రభంజనం):పట్టణంలోని 7వ వార్డులో గురువారం ఎస్ఐఆర్ మ్యాపింగ్ సవరణ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. వార్డు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మ్యాపింగ్ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మ్యాపింగ్లో నమోదు చేసిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏమైనా తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం ఉంటే వాటిని గుర్తించి, అక్కడికక్కడే అవసరమైన సవరణలు పూర్తి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రికార్డులను సరిదిద్దడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాణి భరద్గౌడ్, వార్డు కౌన్సిలర్ గర్రె మాధవి, పెలిమెల్లి లావణ్య, ఆర్ఐ రామారావు, సీనియర్ అసిస్టెంట్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్, బీఎల్ఓ అక్తర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని అధికారులకు సహకరించారు.


