Thursday, August 27, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeAndhraవివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుల్లో ఒకరైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటంతో ఆయన కోర్టుకు రాలేకపోయినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్‌ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు సైతం వ్యక్తిగత కారణాల వల్ల కోర్టు విచారణకు హాజరుకాలేదు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు ఉమాశంకర్ రెడ్డి, వై.ఉదయ్‌కుమార్‌రెడ్డిలు సీబీఐ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఉభయ పక్షాల వాదనలు, నిందితుల హాజరును పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.