Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeJNTUలో విద్యార్థుల ఘర్షణ కలకలం.. 8 మంది అదుపులో: బాలానగర్ డీసీపీ రితిరాజ్

JNTUలో విద్యార్థుల ఘర్షణ కలకలం.. 8 మంది అదుపులో: బాలానగర్ డీసీపీ రితిరాజ్

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి( ప్రభంజనం ): కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ (JNTU) క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, డయల్ 100కు ఫిర్యాదు అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని డీసీపీ తెలిపారు. అయితే అర్దరాత్రి 2:30 గంటల ప్రాంతంలో విద్యార్థులు మరలా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి గాయాలైనట్లు చెప్పారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.

గొడవకు అసలు కారణం ఇదే..

మొదటగా కాలేజీకి చెందిన ఒక అమ్మాయికి సమస్య ఎదురుకావడంతో ఆమె తన స్నేహితుడికి ఫిర్యాదు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ విషయమై మాట్లాడుకుంటున్న సమయంలో మాటామాటా పెరిగి వివాదం పెద్దదైంది. క్రమంగా ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని వివరించారు.

మద్యం మత్తులో విద్యార్థి..

ఈ ఘటనలో పాల్గొన్న ఒక విద్యార్థి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఆ విద్యార్థి బయట మద్యం తాగి క్యాంపస్‌లోకి వచ్చాడా, లేక హాస్టల్/క్యాంపస్ లోపలే సేవించాడా అనే కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ రితిరాజ్ తెలిపారు. త్వరలోనే జేఎన్టీయూ ప్రిన్సిపల్, వార్డెన్‌లతో సమావేశమై క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు, కార్చచరణపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.